Tuesday 24 April 2012

అక్షయ తృతీయ అంటే

శ్రీ గురుభ్యోన్నమః




అందరికీ నమస్సులు

ఈ నాటి అక్షయ తృతీయ అందరికీ అక్షయమగు శుభఫలములిచ్చుగాక, లోకము శాంతి

సౌభాగ్యములతో ఉండుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ తిథిని గూర్చి కొన్ని

విషయములు పురాణోక్తమైనవి ఇక్కడ పొందు పరుస్తున్నాను.



అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన

వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని

చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం

ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని డబ్బులేకున్నా అప్పు చేసో

తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవ్వడం అటుంచి చేసిన అప్పులు

తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అయ్యి కూర్చుంటాయి.



మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం..

ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి

చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమం,

దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది.

(పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల

వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందిగా... ).

ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే విశేష

పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మమాచరించినా కూడా

తత్సంబంధఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు

పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో

స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత ఆ

బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని

దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో

స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో

ఈశ్వర వాక్కు.

ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా

వ్రతాన్ని ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి

విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున

ముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని,

గట్టిగా ఉన్న బియ్యము, అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ

ధాన్యమునుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన

ఆహారముని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు)



శ్రీ నారద పురాణం కూడా, ఈ నాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని

చెప్తోంది.

ఈ నాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో ఈ

నాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ తృతీయ నాడు గంగా

తీరంలో నియమంతో ఘ్రుత ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు,

సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్ర

హంసలతోకూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి

సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరవాత గంగా తీరంలో అత్యంత

ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మ జ్ఙానియై ముక్తిని

పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్ని

ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమిమీద పుట్టి

చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా

నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న

తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత

భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు

శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును. అతడు

నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడై

సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి

స్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఙానియై

అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును

పొందెదడు. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును

విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై

విరాజమానుడగును.



దీనివల్ల తెలిసేదేమంటే బంగారం కొంటే అక్షయం కాదు, ఈ రోజు చేసే ధర్మ

కార్యాలు, ఉపాసనలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని.



తెలియని వారికి ఇది తెలియ చెప్పండి. ఈ నాడు డబ్బులు లేకున్నా అప్పు చేసి

బంగారం యొక్క డిమాండు పెంచి తద్వారా ధర పెంచి, దేశ ఆర్థిక పరిస్థులను,

వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఇన్ఫ్లేషన్ పేర ఇబ్బంది పాలు చేయకండి.


original source: Sri ayyagari suryanagendra garu.

Tuesday 10 January 2012

MANMOHAN SINGH ECHOES JINNAH’S LANGUAGE ON MUSLIMS

One of the forwarded mail:

Congress *new* Hand symbol +




Prime Minister Manmohan Singh said plans for minorities, particularly Muslims, must have the ‘first claim’ on resources so that benefits of development reach them equitably.

”We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably the fruits of development. These must have the first claim on resources,” he said in his address at the 52nd meeting of the National Development Council (NDC) in New Delhi.

“Minorities kya unkey damad lagte hain (is minority community his son-in-law)

Manmohan Singh what are you talking about?

”ostradamus predicted that the world would be destroyed by a man in a blue turban. We all thought it’d be Osama or Saddam, but had to reject them since they didn’t wear a blue turban.




But lo and behold – the man to destroy India is already here — none other than our blue turbaned PM, who has now publicly stated that Muslims in India must get “first preference to national resources”

This man must be removed from office before he sells whatever’s left of the nation to someone else

Dear Friends:
Please forward to millions of voters.. Congress should be perceived as a pro muslim and anti Hindu party by the voters.

Friday 6 January 2012

మురికి బొమ్మ - Dirty Picture

శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
ఆఫీస్ లో మా మేనేజర్ ఏదో మీటింగ్ అంటే వెళ్ళా. "We need to think about big picture" అని ఏదేదో చెప్తున్నాడు. ఆయన బిగ్ పిక్చర్ అనగానే నాకు డర్టీ పిక్చర్ గుర్తొచ్చింది. తర్వాత నాకింకా కొన్ని డౌట్లొచ్చాయి.

నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన , ఓ ఎస్.వి రంగారావుగారు, ఊర్వశి శారద వీళ్ళ పేర్ళు జాతీయ స్థాయిలో చాలామందికి తెలియవు. ఎస్.వి. రంగారావంటే గుర్తొచ్చింది, ఏమి మనిషండీ, రూపు గట్టిన హిరణ్యకశిపుడే అనిపిస్తాడు భక్త ప్రహ్లాద సినిమాలో. "శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణువు కధ" లో వల్లభుడనే సమాధానం వచ్చే పొడుపుకధ విప్పే సమయంలో, సంకెళ్ళు పటపటా తెంపే సన్నివేశంలో ఆయన హావభావాలు అలా గుర్తుండిపోయాయి. ఇలాంటివాడు కాబట్టే సంకెళ్ళు తెంపగలిగాడు అని అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆయనవి ఇంకా మంచి మంచి సినిమాలు ఉన్నాయనుకోండి, నాకు బాగా నచ్చిన సినిమా భక్త ప్రహ్లాద, నాకు బాగా గుర్తున్న సీన్లు పైన చెప్పిన రెండూనూ.
అలాంటి తరం నుండి, నేటి తరం సినిమాలు ఎలా ఉన్నాయో చూస్తే కొంచెం బాధగానే ఉంది.
ఎందుకు ఈ మధ్య మన హీరోయిన్లంతా ఐటం సాంగులు, వాంపు రోల్స్ మీద పడ్డారు, ఇవ్వేళ ఏ ఇంట్లో విన్నా "జిలేబీ భాయ్ " అనో, లేకుంటే "చిక్ని చమేలి" అనొ ,"ఊ ళళా ఊళళా" అనొ,"చమ్మక్ చల్లో" అనొ ,"డియ్యాలో డియ్యాలో " అనొ, "రింగ రింగ" అనొ తప్ప వేరే పాటలు వినపడట్లేదు. మీడియా కూడా వీటినే పాపులర్ చెయ్యడానికి చూస్తుంది. రోజుకి పదిసార్లు అదే పాటని ప్రసారం చేస్తే , వాళ్ళని చూసి పిల్లలు కూడా ఓ మల్లికా షెరావత్ లాగానో, విద్యాబాలన్ లాగానో అయితే మనకి తొందరగా పేరొస్తుందనుకున్నరనుకోండి , సామాజిక విలువలు ఏ స్థాయికి పడిపోతాయో అందరూ అర్ధం చేసుకోవాలి. పిల్లలు ఏం చూస్తున్నారో ,వాటి ప్రభావం పిల్లలమీద ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అందరూ చూస్తున్నారు కదా, ఇవ్వాళ ఇదే ట్రెండ్ అని వదిలేస్తే, దాని పర్యవసానం చాలా తీవ్రం గా ఉంటుంది.

నేనో చిన్న ఉదాహరణ చెప్తాను.

మా కజిన్ ఒకామెకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దామె పేరు వైష్ణవి, పాటలు బాగా పాడుతుంది అంటే ఒక రోజు ఏదన్నా పాట పాడమ్మా అని అడిగా, అంతే డియ్యాలో,డియాలో..... రింగ రింగ అని మొదలు, నాకు చిరాకు వేసి ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట అని అడిగా,మా నాన్న సెల్లులో పాటలు అని చెప్పింది. వాళ్ళ నాన్న సెల్లులో ప్లే చేస్తుంటే విని నేర్చుకుంది. తనకి ఆ పాట పూర్తి అర్ధం తెలియదు. సరే నేను ఒకసారి "మహా ప్రాణదీపం ,శివం,శివం" పాట వినిపించాను. అర్ధం కాకపోయినా మామయ్యా, ఈ పాటే బాగుంది, మళ్ళీ పెట్టవా అని అడిగి మరీ విన్నారు, ఎప్పుడు వెళ్ళినా మర్చిపోకుండా మావయ్యా అల్లా శివం పాట పెట్టవా అని అడిగి మరీ వింటారు. ఆ పాటకీ వాళ్ళకి అర్ధం తెలియదు, కానీ ఆ పాట వినేకంటే ఈ పాట వినడం మంచిది కదా.
రేపు పొద్దున్న ఈ పాటకి అర్ధం తెలిస్తే శివతత్వం మీద ఆసక్తి పెరుగుతుంది, ఒక్క పాట వేదాలెన్నో, సంగీత గతులెన్నో, ద్వాదశ జ్యోతిర్లింగాలేంటో, పంచాక్షరీ ప్రాశస్త్యమేంటో, అన్నిటి గురించీ చెప్తుంది. వీటిలో ఏ ఒక్కదానిమీద ఆ పాపకి ఆసక్తి కలిగినా తన జీవితం బాగుంటుంది కదా. on the other hand రేపు పొద్దున్న పెద్దయ్యాక డియ్యాలో డియ్యాలో పాట అర్ధం అయ్యే వయసు వచ్చినప్పుడు ?..........

అందుకే అంటారు మాట్లాడే మాట ఆత్మహత్యా సదృశమూ కాగలదు, అభయ,జ్ఞాన ప్రదానమూ చెయ్యగలదు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం రామాయణమే ఉంది. ఒక పతివ్రతని బంధించి తన ఇంట్లో పెట్టి అనకూడని మాటలన్నీ అని చావు కొని తెచ్చుకున్నాడు రావణాసురుడు, ఒక పతివ్రత దుఃఖాన్ని చేత్తో స్పృశించకుండా తన వాక్కుతో ఓదార్చి ధైర్యం చెప్పి ఆమెని మనస్పూర్తిగా నవ్వేలా చెయ్యగలిగాడు, శత్రు సభా మధ్యంలో నిలబడి నిర్భీతిగా మాట్లాడగలిగాడు హనుమ.

వాళ్ళు డబ్బొస్తుంది కదా అని ఆ మురికి బొమ్మల్లో పొర్లాడుతున్నారు, ఇకనుండైనా ఈ మురికి బొమ్మల మూలంగా పిల్లలకి మురికి అంటకుండా జాగ్రత్త పడదాం.

Tuesday 27 December 2011

భగవత్ గీత గురించి

source: GLN Muthy garu.
ఒక సారి భగవత్ గీత గురించి
ఒపెంహ్యమార్ అనే అణు శాస్త్రవేత్త తాను అణువుల మధ్య ఉన్న విస్ఫోటన కారకాల ను ను భగవత్ గీత ద్వారా తెలుసుకోన్నట్లు ప్రకటించాడు
The first atomic bomb was detonated on July 16, 1945 in the Trinity test in New Mexico; Oppenheimer remarked later that it brought to mind words from the Bhagavad Gita: "Now, I am become Death, the destroyer of worlds.

Oppenheimer later recalled that, while witnessing the explosion, he thought of a verse from the Hindu holy book, the Bhagavad Gita:

" If the radiance of a thousand suns were to burst at once into the sky, that would be like the splendor of the mighty one ..."

Years later he would explain that another verse had also entered his head at that time: namely, the famous verse: "kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravtta",

Two days before the Trinity test, Oppenheimer expressed his hopes and fears in a quotation from the Bhagavad Gita:
In battle, in the forest, at the precipice in the mountains,
On the dark great sea, in the midst of javelins and arrows,
In sleep, in confusion, in the depths of shame,
The good deeds a man has done before defend him.

ఇక్కడ లంకె లో ఇవ్వబడ్డ వ్యాసాన్ని చదవండి
http://www.amphilsoc.org/sites/default/files/Hijiya.pdf

......................................................................................

"When I read the Bhagavad-Gita and reflect about how God created this universe everything else seems so superfluous." ~ Albert Einstein

"The Bhagavad-Gita has a profound influence on the spirit of mankind by its devotion to God which is manifested by actions." ~ Dr. Albert Schweizer

"The Bhagavad-Gita is the most systematic statement of spiritual evolution of endowing value to mankind. It is one of the most clear and comprehensive summaries of perennial philosophy ever revealed; hence its enduring value is subject not only to India but to all of humanity." ~ Aldous Huxley

"The Bhagavad-Gita is a true scripture of the human race a living creation rather than a book, with a new message for every age and a new meaning for every civilization." ~ Rishi Aurobindo

"The idea that man is like unto an inverted tree seems to have been current in by gone ages. The link with Vedic conceptions is provided by Plato in his Timaeus in which it states..." behold we are not an earthly but a heavenly plant." ~ Carl Jung

"In the morning I bathe my intellect in the stupendous and cosmogonal philosophy of the Bhagavad-Gita, in comparison with which our modern world and its literature seems puny and trivial." ~ Henry David Thoreau

"The marvel of the Bhagavad-Gita is its truly beautiful revelation of lifes wisdom which enables philosophy to blossom into religion." ~ Herman Hesse

"The Bhagavad-Gita calls on humanity to dedicate body, mind and soul to pure duty and not to become mental voluptuaries at the mercy of random desires and undisciplined impulses."
"When doubts haunt me, when disappointments stare me in the face, and I see not one ray of hope on the horizon, I turn to Bhagavad-Gita and find a verse to comfort me; and I immediately begin to smile in the midst of overwhelming sorrow. Those who meditate on the Gita will derive fresh joy and new meanings from it every day."
~ Mahatma Gandhi

"The Bhagavad-Gita deals essentially with the spiritual foundation of human existence. It is a call of action to meet the obligations and duties of life; yet keeping in view the spiritual nature and grander purpose of the universe." ~ Pandit Jawaharlal Nehru

"I owed a magnificent day to the Bhagavad-Gita. It was the first of books; it was as if an empire spoke to us, nothing small or unworthy, but large, serene, consistent, the voice of an old intelligence which in another age and climate had pondered and thus disposed of the same questions which exercise us."
"The Bhagavad-Gita is an empire of thought and in its philosophical teachings Krishna has all the attributes of the full-fledged montheistic deity and at the same time the attributes of the Upanisadic absolute." ~ Ralph Waldo Emerson

"In order to approach a creation as sublime as the Bhagavad-Gita with full understanding it is necessary to attune our soul to it." ~ Rudolph Steiner

"From a clear knowledge of the Bhagavad-Gita all the goals of human existence become fulfilled. Bhagavad-Gita is the manifest quintessence of all the teachings of the Vedic scriptures." ~ Adi Sankara

"The Bhagavad-Gita is not seperate from the Vaisnava philosophy and the Srimad Bhagavatam fully reveals the true import of this doctrine which is transmigation of the soul. On perusal of the first chapter of Bhagavad-Gita one may think that they are advised to engage in warfare. When the second chapter has been read it can be clearly understood that knowledge and the soul is the ultimate goal to be attained. On studying the third chapter it is apparent that acts of righteousness are also of high priority. If we continue and patiently take the time to complete the Bhagavad-Gita and try to ascertain the truth of its closing chapter we can see that the ultimate conclusion is to relinquish all the conceptualized ideas of religion which we possess and fully surrender directly unto the Supreme Lord." ~ Swami Prabhupada

"The secret of karma yoga which is to perform actions without any fruitive desires is taught by Lord Krishna in the Bhagavad-Gita." ~ Vivekananda

Monday 26 December 2011

సనాతన ( హిందు ) ధర్మం లో "ఓం" ను ఎందుకు భగవంతుని చిహ్నము గా స్వీకరించారు?

శబ్దమే భగవంతుడని చెప్పబడింది.ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది.శబ్దోచ్చారణ లో మనం కంఠం లో ని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు.ఇది ఓంకారానికి బీజం గా ఉంది.చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు.నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయము లో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది.అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.

Thursday 26 May 2011

శ్రీమత్సుందరకాండ

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

తప్పో ఒప్పో, నియమంగానో కాదో, మొత్తానికి జీవితంలో ఒక గొప్ప పని సాధించానన్న తృప్తి కలిగింది ఈ రోజు ఉదయం.
"సర్వం శ్రీసీతారామచంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణమస్తు" అంటూ సుందరకాండ మూడవ ఆవృత్తి పూర్తి చేసి స్వామికి నివేదించుకుంటూ ఉంటే.


పోయిన సంవత్సరం అతి కష్టమ్మీద సుందరకాండ రెండు సార్లు పారాయణ చెయ్యగలిగాను. ఈ సారి ఎలాగైనా మూడు సార్లు చెయ్యాలని అనుకున్నాను. అంతలోనే వసంత నెలతప్పడం , సందేహాలమీద సందేహాలు. ఇక ఈ సంవత్సరం కుదరదేమో అని అనుకుంటు ఉండగా, మాస్టరుగారి నుండి ఆదేశం ఈసారి మరింత శక్తివంతంగా హనుమద్రక్షాయాగం జరగాలని .అందుకు అన్ని హనుమత్ స్తోత్రాలతోనూ యాగాన్ని అనుసంధానించాలని, అందులో భాగంగా నన్ను సుందరకాండ చెయ్యమని .. చెయ్యగలనో లేదో అనుకుంటునే మొదలుపెట్టాను, నాకు పారాయణ చేసే అదృష్టం ఉంటే ఆ స్వామి చూసుకుంటారు అని. మొదలుపెట్టిన పది రోజులకి విజయవాడ వెల్లాల్సి వచ్చింది. అక్కడ ఎలా చదవడం, ఇప్పటికే కొంచెం ఎగతాళి గా మాట్లాడుతున్నారు నీకెందుకురా ఇవన్నీ అని, ఇక సుందరకాండ తీసుకెళ్ళి పారాయణ చేస్తే గోల గోల అయిపోతుందని భయపడ్డాను. సరే ఏదైతే అదే అయ్యిందని తీసుకెళ్ళాను. ఇంట్లో చదవకుండా గుడికి వెళ్ళి చదువుదామనుకున్నా. కానీ హోరుమని వాన (ఎండాకాలంలో) . ఇంట్లో గొడుగుకూడా లేదు, చివరికి ఇంట్లోనే పారాయణ చేసాను. విచిత్రం మా వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు పారాయణ గురించి, పైగా చేస్తున్నంతసేపూ డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నారు.తర్వాత ఎప్పుడు వెల్తున్నావు వినుకొండకి, అని వివరాలు అడిగి కనుక్కొన్నారు. అప్పుడు అర్ధం అయ్యింది అర్ధం లేని నా భయాల్ని దూరం చెయ్యడానికే స్వామి ఈ గేమ్ ఆడారని.

సుందరకాండ పారాయణ చేస్తే ఏదో ఫలితాలు కలుగుతాయని అంటారు కానీ నావరకైతే సుందరకాండ పారాయణ చెయ్యగలగడమే పెద్ద ఫలం. ఎంత అనుకుంటే మాత్రం చెయ్యగలం చెప్పండి? నావరకు స్వామి సుందరకాండ ఇచ్చి ఆరు, ఏడు సంవత్సారాలయ్యింది. రోజూ దణ్ణం పెట్టుకునేవాడిని కానీ ఐదేళ్ళకి గానీ తెరిచి పారాయ చెయ్యలేకపోయాను. ఆ స్వామి అనుమతి, అనుగ్రహం కూడా ఉండాలి కదా.భాగవతంలో యశోదమ్మ , "ఏ సిద్ధాశ్రమములన్ తొక్కితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో" ఈ నాడు మన బిడ్డ ఈ ఉత్పాతలనుండి తప్పించుకున్నాడు అన్నట్టు, ఏ పుణ్యశేషమో మిగిలిఉండబట్టి ఇంతమంది మార్గదర్శకులైన పెద్దవాళ్ళ దగ్గర రామాయణాదుల గురించి తెలుసుకునే అదృష్టం కలిగింది. విన్నది చాలు ఇక చదువు పూర్తిగా తెలుసుంటావు అన్నట్టు , 2010 జనవరిలో ఒకనాడు శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి సుందరకాండ ప్రవచనం వింటుంటే ఆయన ఒక మాట అన్నారు.
"సంస్కృతం రాదని అనకండి.కర్త, కర్మ. క్రియ శబ్దస్వరూపం తెలిస్తే రామాయణం , భగవద్గీత సులభంగా అర్ధమవుతాయి, ఇంతకంటే సులభంగా ఇక ఎవ్వరు రాయలేరు, స్వామి మనల్ని అనుగ్రహించి సులభంగా తనను చేరడానికి ఇచ్చిన మందులివి రెండూ, అలాంటివాటిని సంస్కృతంలో ఉన్నాయని వంక పెట్టి వదిలెయ్యద్దు. మొదట్లో కొంచెం కష్టం గా ఉండచ్చు , కానీ పోనూ పోనూ అదే అలవాటవుతుంది ఇందులో ఎక్కడా పెద్ద పెద్ద సమాసాలుండవు." అని.
అప్పుడు అనిపించింది ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని . తర్వాతి రోజే పారాయణ మొదలుపెట్టాను. ఇప్పటికి ఐదు సార్లు పారాయణ చేసాను ఈ రెండు సంవత్సరాల్లో.ఒక్కొక్కటిగా నా బలహీనతలనన్నింటినీ నాకు చూపించారు స్వామి.ఇప్పటికీ ఏదన్నా తప్పుచేస్తే ప్రమధితవ్యం, ప్రమధితవ్యం అని హెచ్చరిస్తూనే ఉన్నారు.

రేపే హనుమజ్జయంతి, ఎల్లుండి పూర్ణాహుతి . రెండు సంవత్సరాలు ఎదురుచూసాను హనుమాన్ జయంతికి పీఠంలో ఉండాలని. ఇప్పటికే పీఠంలో చాలామంది బ్రహ్మచారులున్నారు(అయ్యప్ప, స్వామి,...) ఇంకో బ్రహ్మచారి అవసరంలేదని చివరికి గృహస్తుగా అనుమతించారు స్వామి. మీరు కూడా రండి, స్వామి వారిని దర్శించుకుని స్వామి కృపకి పాత్రులవుదాము.
యాగంలో పాల్గొనాలనుకుంటే సంప్రదించాల్సిన నంబర్లు

౯౯౪౮౨౩౫౬౪౧(9948235641) -దుర్గేశ్వర గారు